
హైదరాబాద్: శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ ను అత్యాచారం, హత్య చేసిన నిందితులకు మద్ధతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వైపు డాక్టర్ హత్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుంటే… అమ్మాయిలను రేప్ చేయడం తప్పులేదంటూ అసభ్యకరంగా.. పోస్టులు పెట్టిన వారిపై జనం సీరియస్ అయ్యారు. దీంతో పాటు రాచకొండ పోలీస్ స్టేషన్ లో బాధితుల తరపున ఫిర్యాదు చేశారు. అమర్ నాథ్, శ్రవణ్, సందీప్ కుమార్, స్మైలీ నాని అనే వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైం పోలీసులు. ఇలాంటి ఘటనలపై ఎవరైనా అసభ్యకరంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు.