వైఎస్ షర్మిల దీక్షను భగ్నం చేసిన పోలీసులు

వైఎస్ షర్మిల దీక్షను  భగ్నం చేసిన పోలీసులు

మెదక్ జిల్లా బొగుడ భూపతిపూర్ లో  వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ.. దీక్ష చేస్తున్న షర్మిలను బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు. అంతకు ముందు భూపతిపూర్ లోని రైతు రవి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రక్తత ఏర్పడింది. షర్మిల కోసం వచ్చిన పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. షర్మిలను తీసుకెళ్లనివ్వకుండా.. గ్రామస్తులు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.  బలవంతంగా వ్యానులో తీసుకెళ్లారు పోలీసులు.