దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు : నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ కల్లూ రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా ప్రైవేట్ స్కూళ్ల బంద్కు ప్రైవేట్ స్కూల్ యజమాన్యాల రాష్ట్రనాయకుడు యానాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు.
గురువారం ట్రాస్మా ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ హైస్కూల్లో ఆమె ఆత్మకు అశ్రునివాళి సభ, అనంతరం పాఠశాల నుంచి చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జిలు ధరించి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మైనర్లు సెల్ ఫోన్లు వాడకుండా నిషేధిస్తూ చట్టం తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
