టీచర్ కు పెళ్లి ప్రపోజల్.. తిరస్కరించినందుకు కత్తితో దాడి

టీచర్ కు పెళ్లి ప్రపోజల్.. తిరస్కరించినందుకు కత్తితో దాడి

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రవైటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోన్న మహిళను, ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయలపాలైన వారిద్దరూ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

రాజు అనే 32ఏళ్ల వ్యక్తి ఆరు నెలల క్రితం సోషల్ మీడియాలో 23 ఏళ్ల బాధితురాలిని కలిశాడు. అలా వారిద్దరి మధ్యా మొదలైన స్నేహం బలపడింది. ఆ తర్వాత అదే అదనుగా తీసుకున్న రాజు.. ఆమెకు లవ్ ప్రపోజ్ చేయగా ఆమె తిరస్కరించింది. ఇది కొన్ని రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 1న మధ్యాహ్నాం తనను కలవాలని రాజు, ఆ మహిళకు ఫోన్ చేశాడు. ఆమె అతన్ని కలవగానే.. పెళ్లి చేసుకోవాలనే తన కోరికను మరోసారి ఆమె ముందు పెట్టాడు. కానీ రెండో సారీ అతని ప్రపోజల్ ను ఆమె తిరస్కరించడంతో.. దాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. ఆ తర్వాత ఓ కత్తిని కొనుగోలు చేసి.. ఆ మహిళ పనిచేసే పాఠశాలకు చేరుకుని, ఆమె ఇంటికి వెళ్లే వరకు వేచి చూశాడు.

కూకట్ పల్లిలోని విజయనగర్ కాలనీలో సాయంత్రం 5గంటల సమయంవో ఆమె పాఠశాల నుంచి ఇంటికి రాగానే రాజు ఆమెను పొడిచినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో అతను ఆమె మెడపై తీవ్ర గాయాలు చేశాడు. ఆ తర్వాత తన గొంతు కోసుకుని ఆత్మహత్యం చేశాడు. వెంటనే స్థానికులు అతన్ని అడ్డుకుని పోలీసులను సంప్రదించారు. ఆ తర్వాత వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో దాడికి పాల్పడిని రాజుపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.