హైదరాబాద్: మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ గురించి చర్చించనున్నారు. ఇక సభ ఎన్ని రోజులు జరగాలి అనే విషయంపై బీఏసీ సమావేశంలో చర్చించి సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి కూడా ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు సమాచారం. కాగా.. బడ్జెట్ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరిన్ని వార్తల కోసం..