రేష‌‌‌‌న్‌‌‌, హెల్త్, స్కీమ్లకు ఒకే డిజిటల్​కార్డు

రేష‌‌‌‌న్‌‌‌, హెల్త్, స్కీమ్లకు  ఒకే డిజిటల్​కార్డు
  • పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్​లోని
  • ఒక టౌన్​, ఒక విలేజ్​లో అమలు: సీఎం రేవంత్​
  • ఎక్కడైనా రేషన్​, ఆరోగ్య సేవలు పొందేలా కార్డు..
  • అందులో ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్
  • మార్పులు చేర్పులు చేసుకునేలావెసులుబాటు
  • మానిట‌‌‌‌రింగ్​కు జిల్లాలవారీగా వ్యవస్థలుఏర్పాటు చేయాలని ఆధికారులకు ఆదేశం

 హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు: ‘వన్ స్టేట్.. వన్ డిజిటల్ కార్డు’ విధానంతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రేషన్​కు, హెల్త్​ ప్రొఫైల్​కు, సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా ఒకే ఫ్యామిలీ డిజిటల్​ కార్డు రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ప్రతి కుటుం బానికి ఈ ఫ్యామిలీ డిజిట‌‌‌‌ల్ కార్డు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్​ ప‌‌‌‌రిధిలో ఒక ప‌‌‌‌ట్టణ‌‌‌‌, ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంపిక చేసు కొని పైలట్ ప్రాజెక్టు కింద కార్యాచ‌‌‌‌ర‌‌‌‌ణను ప్రారంభించాలని ఆదేశించారు. ఈ అంశంపై సోమవారం మంత్రులు ఉత్తమ్ ​కుమార్​ రెడ్డి, దామోదర రాజనర్సింహ,  ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ జూబ్లీహిల్స్​లోని త‌‌‌‌న నివాసంలో స‌‌‌‌మీక్షించారు. కుటుంబాల స‌‌‌‌మ‌‌‌‌గ్ర వివ‌‌‌‌రాల న‌‌‌‌మోదుతో ఇప్పటికే రాజ‌‌‌‌స్థాన్, హ‌‌‌‌ర్యానా, క‌‌‌‌ర్నాట‌‌‌‌క రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయ‌‌‌‌నం చేయాల‌‌‌‌ని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆ కార్డులతో క‌‌‌‌లుగుతున్న ప్రయోజ‌‌‌‌నాలు, ఇబ్బందుల‌‌‌‌పై స్టడీ చేసి స‌‌‌‌మ‌‌‌‌గ్ర నివేదిక రూపొందించాల‌‌‌‌న్నారు. అర్హులంద‌‌రికీ సంక్షేమ ప‌‌థ‌‌కాలు అందేలా ఫ్యామిలీ డిజిట‌‌ల్ కార్డులు ఉండాల‌‌ని, ఈ కార్డుల‌‌తో ల‌‌బ్ధిదారులు ఎక్కడైనా రేష‌‌న్‌‌, ఆరోగ్య సేవ‌‌లు పొందేలా ఉండాల‌‌ని అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ఫ్యామిలీ డిజిట‌‌ల్ కార్డులో ప్రతి కుటుంబ స‌‌భ్యుని హెల్త్ ప్రొఫైల్ ఉండాల‌‌ని, అది దీర్ఘకాలంలో వైద్య సేవ‌‌ల‌‌కు ఉప‌‌యోగ‌‌ప‌‌డుతుంద‌‌న్నారు.  ఆయా కుటుంబ స‌‌భ్యులు త‌‌మ కుటుంబాల్లోని స‌‌భ్యుల మార్పుచేర్పులను ఎప్పటిక‌‌ప్పుడు అప్‌‌డేట్ చేసుకునేలా కార్డు ఉండాల‌‌ని ఆయన సూచించారు. ఈ ఫ్యామిలీ డిజిట‌‌ల్ కార్డుల వ్యవ‌‌స్థ మానిట‌‌రింగ్​కు జిల్లాలవారీగా వ్యవస్థల‌‌ను ఏర్పాటు చేయాల‌‌ని ఆదేశించారు. సమావేశంలో సీఎస్​ శాంతికుమారి, ఆరోగ్య శాఖ కార్యద‌‌ర్శి క్రిస్టియానా జ‌‌డ్ చొంగ్తూ,  సీఎం స్పెషల్​ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం కార్యద‌‌ర్శులు చంద్రశేఖ‌‌ర్‌‌రెడ్డి, సంగీత స‌‌త్యనారాయ‌‌ణ‌‌, పౌర‌‌స‌‌ర‌‌ఫ‌‌రాల శాఖ క‌‌మిష‌‌న‌‌ర్ డీఎస్ చౌహాన్‌‌  త‌‌దిత‌‌రులు పాల్గొన్నారు.