చదుకోవాలంటూ పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దు : తమిళి సై

చదుకోవాలంటూ పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దు : తమిళి సై

వికారాబాద్ జిల్లా : పిల్లలు చదువుకోవాలంటూ వారిపై ఒత్తిడి చేయవద్దని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సూచించారు. పిల్లలు ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలని..ఉపాధ్యాయులు కూడా ఎంజాయ్ చేస్తూ పాఠాలు బోధించాలని చెప్పారు. వికారాబాద్ లో మాజీ మంత్రి చంద్రశేఖర్ కు చెందిన బృంగీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్నిగవర్నర్ తమిళి సై ప్రారంభించారు. పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే చదువురాదని, ఇష్టంతో చదివితేనే చదువు వస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలే క్లాస్ ఫస్ట్ రావాలంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. చదువుల్లో సమూల మార్పుల కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. 

కరోనా సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో మన దేశంలోనే సైంటిస్టులు వ్యాక్సిన్లు తయారు చేసి ఇతర దేశాలకు సరఫరా చేసే విధంగా కృషి చేశారని గవర్నర్ తమిళి సై చెప్పారు.తల్లిదండ్రులు కూడా ఆలోచించి తమ పిల్లలు ఒత్తిడికి లోనుకాకుండా ఎంజాయ్ చేస్తూ చదువుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.