11 మందికి శౌర్య అవార్డ్స్..461 మందికి పోలీస్ సేవా పతకాలు

11 మందికి శౌర్య అవార్డ్స్..461 మందికి పోలీస్ సేవా పతకాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్నిపురస్కరించుకుని ప్రభుత్వం పోలీస్ సేవా పథకాలను ప్రకటించింది. ఈ మేరకు   హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా  ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు పలు విభాగాల్లో్ అందించిన సేవలకు గానూ ఈ అవార్డులు ప్రకటించింది. మొత్తం 11 మందికి శౌర్య పతకం, 19 మందికి మహోన్నత సేవా పతకాలు, 461 మందికి పోలీస్ మెడల్స్ దక్కనున్నాయి.  

 పోలీసుశాఖలోని గ్రేహౌండ్స్‌ విభాగానికి చెందిన 9  మందికి  శౌర్య పతకం.  16 మంది పోలీసులకు మహోన్నత సేవా పతకం. 92 మంది ఉత్తమ సేవా పతకాలు. 47 మంది పోలీసులకు కఠిన సేవా పతకాలు.  461 మందికి సేవా పతకాలు ప్రకటించింది ప్రభుత్వం

ALSO READ | తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు..స్పెషల్ గెస్ట్గా జపాన్ బృందం

 విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలో ఒకరికి ఉత్తమ సేవా పథకం,  ఐదుగురికి సేవా పతకాలు వరించాయి.   డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీస్‌ శాఖలో ఇద్దరికి శౌర్య పతకం,  ఒకరికి మహోన్నత పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పథకాలు, 14 మందికి సేవా పతకాలు వచ్చాయి.

 ACB శాఖలో ఒకరికి మహోన్నత సేవా పథకం,  నలుగురికి ఉన్నత సేవా పథకం రాగా మరో 17 మందిని సేవా పతకాలు వచ్చాయి.  స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ఒకరికి మహోన్నత సేవా పథకం.   ముగ్గురికి ఉత్తమ సేవా పథకాలు, 15 మందికి సేవా పథకాలు వరించాయి.