ఐటీడీఏకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డు.. సీఎం రేవంత్ చేతుల మీదుగా తీసుకున్న పీవో రాహుల్

ఐటీడీఏకు టూరిజం ఎక్సలెన్స్ అవార్డు.. సీఎం రేవంత్ చేతుల మీదుగా తీసుకున్న పీవో రాహుల్

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం ఐటీడీఏలో ట్రైబల్​ మ్యూజియాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది పర్యాటకులను విశేషంగా ఆకర్షించినందుకు 2025 సంవత్సరానికి టూరిజం ఎక్స్ లెన్స్ అవార్డును సీఎం రేవంత్​రెడ్డి శనివారం ఐటీడీఏ పీవో బి.రాహుల్​కు అందజేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శిల్పారామంలో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు, క్రీడాశాఖ మంత్రి వాకాటి శ్రీహరి కూడా పాల్గొని పీవో రాహుల్​ కృషిని అభినందించారు.