హైదరాబాద్, వెలుగు : ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మూడో రోజైన సోమవారం తెలంగాణకు రెండు మెడల్స్ లభించాయి. జిమ్నాస్టిక్స్లో నిషిక అగర్వాల్ సిల్వర్ నెగ్గగా, రెజ్లింగ్లో నిఖిల్ యాదవ్ బ్రాంజ్ గెలిచాడు. హర్యానాలోని పంచకులలో జరిగిన అండర్18 గర్ల్స్ జిమ్నాస్టిక్స్ అన్ ఈవెన్ బార్స్లో నిషిక 9.14 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది. అండర్18 బాయ్స్ 60 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో నిఖిల్ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ గెలుచుకున్నాడు.