
హైద్రాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో తెలుగు సినీ రచయితలు సంఘం రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావు,పరుచూరి బ్రదర్స్, పలువురు ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. కార్యక్రమంలో దర్శకులు కోదండ రామిరెడ్డికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. పలువురు రచయితలను ఘనంగా సన్మానించారు. సినీ రచయితలు లేకుండా తాము లేమన్నారు చిరంజీవి. సినీ జీవితంలో రచయితలతోనే అత్యంత సన్నిహితంగా ఉంటామన్నారు.