
టాలీవుడ్ నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు. జెమినీ కిరణ్పై 17 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ విజయం సాధించారు. ఇవాళ నిర్మాతల మండలి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం ఓట్లు 1,134 ఓట్లుకు గాను.. 677 ఓట్లు పోలైయ్యాయి. వీటిలో దామోదర ప్రసాద్కు 339 ఓట్లు.. జెమినీ కిరణ్కు 322 ఓట్లు వచ్చాయి.
కాగా మండలి సెక్రటరీలుగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి లు ఎన్నికైయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరి, నట్టికుమార్ ఎన్నికయ్యారు. నిర్మాతల మండలికి సాధారణంగా షెడ్యూల్ ప్రకారం ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు. అయితే కొన్ని రోజుల క్రితం చిన్న నిర్మాతలు ఎన్నికలు నిర్వహించాలని ఆందోళన చేపట్టడంతో ఇవాళ హైదరాబాద్లో ఎన్నికలు నిర్వహించారు.
కాగా, 15 మంది ఈసీ మెంబర్స్ గెలుపొందారు.
దిల్ రాజు –470
దానయ్య –421
రవి కిషోర్ –419
యలమంచిలి రవి –416
పద్మిని –413
బెక్కం వేణుగోపాల్ –406
సురేందర్ రెడ్డి –396
గోపీనాథ్ ఆచంట –353
మధుసూదన్ రెడ్డి –347
కేశవరావు –323
శ్రీనివాద్ వజ్జ –306
అభిషేక్ అగర్వాల్ –297
కృష్ణ తోట –293
రామకృష్ణ గౌడ్ –286
కిషోర్ పూసలు –285