కెన్యా గణేశ్ ఉత్సవాల్లో మనోళ్ల సందడి

కెన్యా గణేశ్ ఉత్సవాల్లో మనోళ్ల సందడి

పద్మారావునగర్​, వెలుగు: కెన్యా దేశంలోని మోంబాసా ప్రాంతంలో స్థిరపడిన హైదరాబాద్ కు చెందిన ప్రవాసాంధ్రులు అక్కడ గణేశ్​ నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఐదు రోజుల పాటు గణేశుడికి పూజలు చేసిన మోంబాసా ప్రాంత తెలుగు ప్రజలు గురువారం సమీపంలోని సముద్రంలోకి పడవపై వెళ్లి నిమజ్జనం చేశారు. 

మోంబాసా తెలుగు అసోసియేషన్​(ఎంవోఎంటీఏ) ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిపినట్లు చైర్మన్​ బి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఫస్ట్​ టైం సెలబ్రేషన్స్​ నిర్వహించామని, ఇక నుంచి ప్రతీ ఏటా కంటిన్యూ చేస్తామని చెప్పారు.