నిర్మాత కాట్రగడ్డ మురారి ఇక లేరు

నిర్మాత కాట్రగడ్డ మురారి ఇక లేరు

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1944 జూన్‌ 14న విజయవాడలో జన్మించిన కాట్రగడ్డ...  యువచిత్ర ఆర్ట్స్‌ పేరుతో పలు  విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. సీతామహలక్ష్మి, గోరింటాకు, జానకీరాముడు, నారి నారి నడుమ మురారి, అభిమన్యుడు, త్రిశూలం, సీతారామ కల్యాణం, శ్రీనివాస కల్యాణం, జేగంటలు వంటి చిత్రాలు ఆయన నిర్మించినవే.

తన సినిమాల్లో ఎక్కువగా సంగీతానికి కాట్రగడ్డ ప్రాముఖ్యత ఇచ్చేవారు. మురారి నిర్మించిన అన్ని చిత్రాలకూ దాదాపుగా కేవీ మహదేవన్‌ సంగీతం సమకూర్చారు. మురారి మృతి పై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.