ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తి వేధింపులు : మహిళ ఆత్మహత్య

ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తి వేధింపులు : మహిళ ఆత్మహత్య

శ్రీకాకుళం: తాను కిరాయికి ఉంటున్న ఇంటి ఓనర్ భార్యను లైంగికంగా వేధించాడు ఓ వ్యక్తి, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం లోని కంచిలిలో జరిగింది. మాదవరావు అనే అతను NRGCSలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే అతను ఒక బ్యాంకర్ ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. ఆ బ్యాంకర్ భార్య బాత్రూంలో స్నానం చేస్తుండగా… సెల్ ఫోన్‌తో వీడియో తీశాడు. తన కోరిక తీర్చాలని లేకపోతే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెధిరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మహిళ… తన బాధను భర్తతో చెప్పుకోలేక… సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.