
జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణపై కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మున్సిపల్ అదనపు ఎంజెడాలో రోడ్డు విస్తరణ అంశాన్ని పొందుపరిచినట్టు చెప్పారు. జగిత్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నష్టపరిహారం చెల్లించేందుకు 70కోట్లు ఖర్చువతుందని.. మున్సిపల్ లో అంత బడ్జెట్ లేదని అన్నారు.
దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు జీవన్ రెడ్డి. అమృత స్కీం కోసం టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని.. త్వరలోనే ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. పట్టణంలో మరో 3 వాటర్ ట్యాంక్ హెడ్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు జీవన్ రెడ్డి.