పాక్ జవాన్లపై టెర్రరిస్టుల దాడి

పాక్ జవాన్లపై టెర్రరిస్టుల దాడి
  • ఇద్దరు ఆఫీసర్లు మృతి 

ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌లోని బలూచిస్తాన్‌‌ ప్రావిన్స్‌‌లో భద్రతా బలగాలపై టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆర్మీకి చెందిన ఒక మేజర్‌‌ ర్యాంక్‌‌ ఆఫీసర్, ఒక జూనియర్‌‌ ఆఫీసర్ మృతి చెందారు. మరో సైనికుడు గాయపడ్డాడు. టెర్రరిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఆ ఏరియాలో పెట్రోలింగ్​ పెంచామని ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. 

ఆదివారం బాలోర్ ప్రాంతంలో బలగాలపైకి టెర్రరిస్టులు కాల్పులు జరిపారని పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సోమవారం వెల్లడించింది. మేజర్‌‌ ర్యాంక్‌‌ ఆఫీసర్ సాకిబ్ హుస్సేన్, జూనియర్‌‌ ఆఫీసర్ నాయక్ బకీర్ ప్రాణాలు కోల్పోయార ని అధికారులు వివరించారు.