
న్యూఢిల్లీ: టెస్లా ఇండియా ముంబైలోని లోధా లాజిస్టిక్స్ పార్క్లో 24,565 చదరపు అడుగుల వేర్హౌసింగ్ స్పేస్ను లీజ్కు తీసుకుందని సీఆర్ఈ మ్యాట్రిక్స్ తెలిపింది. ఈ స్పేస్కు నెలవారీ రెంట్ రూ.37.53 లక్షలు. 5 ఏళ్లకు ఒప్పందం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ కంపెనీ సీఆర్ఈ మ్యాట్రిక్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ను రివ్యూ చేసింది. టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ స్పేస్ను ముంబైలోని కుర్లా-వెస్ట్లో తీసుకుంది. ఈ లాజిస్టిక్స్ పార్క్ను మాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ (లోధా బ్రాండ్తో ప్రాపర్టీలు అమ్మే కంపెనీ) డెవలప్ చేస్తోంది. రెంట్ స్టార్ట్ డేట్ జూన్ 1, 2025 నుంచి ఉంది. ప్రతి ఏడాది రెంట్ 5 శాతం చొప్పున పెరుగుతుంది.
ఈ 5 ఏళ్ల లీజ్ పీరియడ్లో మొత్తం రెంట్ రూ.24 కోట్లు అవుతుందని అంచనా. సీఆర్ఈ మ్యాట్రిక్స్ సీఈఓ అభిషేక్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ, “టెస్లా ఇండియాలోకి ఒక స్ట్రాటజీతో ఎంట్రీ ఇస్తోంది. పూణెలో ఆఫీస్, బీకేసీ, ఢిల్లీ-–ఎన్సీఆర్లో ఫ్లాగ్షిప్ షోరూమ్స్, బీకేసీలో కో-వర్కింగ్ స్పేస్, ఇప్పుడు కుర్లా-వెస్ట్లో వేర్హౌసింగ్ ఫెసిలిటీని రెంట్కు తీసుకుంది” అని చెప్పారు. కాగా, టెస్లాకు ఇండియాలో కార్లు తయారు చేయాలని లేదని, షోరూమ్స్ ఓపెన్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తోందని సోమవారం కేంద్ర హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు.