ప్రశాంతంగా టీజీ ఎడ్ సెట్..32,106 మంది పరీక్షకు హాజరు

ప్రశాంతంగా టీజీ ఎడ్ సెట్..32,106 మంది పరీక్షకు హాజరు

హనుమకొండ, వెలుగు: బీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ ఎడ్ సెట్–2025 ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 38,758 మంది ఎడ్​సెట్​కు దరఖాస్తు చేసుకోగా.. ఆదివారం రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షకు 32,106 మంది హాజరయ్యారు. మొత్తంగా 83 శాతం హాజరు నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం జరిగిన సెషన్​ వన్​ పరీక్షకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణారెడ్డి సెట్ 'ఏ'ను సెలెక్ట్ చేయగా, సెషన్–2కు కేయూ వీసీ సెట్ 'బీ'ని ఎంపిక చేశారు.

ఇదిలాఉంటే రాష్ట్రవ్యాప్తంగా 74 సెంటర్లలో నిర్వహించిన ఎడ్ సెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ బి. వెంకట్రామిరెడ్డి తెలిపారు. బీఎడ్ ప్రవేశాల కోసం కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్​ టెస్టు నిర్వహించగా, వరంగల్ సిటీలోని మోక్షిత్ ఇన్​స్టిట్యూట్, బొల్లికుంట వాగ్దేవి, హనుమకొండలోని అయాన్​ టెక్నాలజీ, జయ కాలేజీ, సుమతిరెడ్డి కాలేజీ, వాగ్దేవి, నోబెల్ ఇన్ స్టిట్యూట్ తదితర సెంటర్లను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణారెడ్డి, కేయూ వీసీ ప్రొ.కె.ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఎడ్ సెట్ కన్వీనర్ ప్రొ.బి.వెంకట్రామిరెడ్డి పరిశీలించారు.