బనకచర్ల ప్రాజెక్ట్‎ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం.. ఆపేందుకు ఏం చేయాలో అన్ని చేస్తం: మంత్రి ఉత్తమ్

బనకచర్ల ప్రాజెక్ట్‎ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం.. ఆపేందుకు ఏం చేయాలో అన్ని చేస్తం: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం (జూన్ 3) మీడియా ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం నిర్మి్స్తోన్న బనకచర్ల ప్రాజెక్టును మేం వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 

బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. దీనిపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‎తో మాట్లాడామని.. ప్రాజెక్ట్ నిర్మించకుండా అడ్డుకోవాలని కోరామని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్ట్‎పై మా అభ్యంతరాలు ఇప్పటికే కేంద్రానికి తెలియజేశామన్నారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాశామని చెప్పారు.

బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఇంకా ఏం ప్రయత్నాలు చేయాలో చేస్తామని స్పష్టం చేశారు. బనకచర్ల ఆపడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తామని తేల్చి చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో మేం ఒప్పుకోమని తెగేసి చెప్పారు. సముద్రంలో కలిసే నీళ్లే వాడుకుంటామని ఏపీ నేతలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టుపై సరైన సమయంలో స్పందిస్తామని పేర్కొన్నారు.