
Anil Ambani: దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత తిరిగి తన వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లేందుకు అనిల్ అంబానీ చేస్తున్న ప్రయత్నాలు గత కొన్ని నెలలుగా ఫలిస్తున్న సంగతి తెలిసిందే. తన అనేక వ్యాపారాలకు ఉన్న రుణాలను తిరిగి చెల్లించటంతో పాటు కొన్ని సంస్థలను రుణ రహితంగా కూడా మార్చాడు. అయినప్పటికీ ప్రస్తుతం ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. నేడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ ఫ్రా కంపెనీల షేర్లు 5 శాతం క్షీణతను నమోదు చేశాయి. సోమవారం రెండు కంపెనీల షేర్లు తమ సరికొత్త 52 వారాల గరిష్ఠాలను తాకినప్పటికీ ప్రస్తుత పరిస్థితులతో నష్టాలను చూస్తున్నాయి. అయితే దీనికి కారణం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ ఇచ్చిన ఆదేశమే కారణంగా తెలుస్తోంది. ఎన్సీఎల్టీ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ ఫ్రా దివాలాకు అంగీకారం తెలపటంతో పరిస్థితి తారుమారైంది.
IDBI ట్రస్ట్షిప్ సర్వీసెస్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ పై తాజా తీర్పు వెలువడింది. ఈ కేసులో ట్రిబ్యునల్ తెహ్సీన్ ఫాతిమా ఖత్రిని తాత్కాలిక రిజల్యూషన్ ప్రొఫెషనల్ గా నియమించింది. దీనిపై స్పందించిన కంపెనీ ఎన్సీఎల్టీ చర్యలు రిలయన్స్ ఇన్ ఫ్రా లేదా దాని అనుబంధ సంస్థలపై ఎలాంటి ప్రభావం చూపబోదని తన స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ లో వెల్లడించింది.
►ALSO READ | IT Layoffs: ఉద్యోగుల ఊచకోత కొనసాగిస్తున్న మైక్రోసాఫ్ట్.. ఈసారి ఎంతమందంటే?
రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంధన కొనుగోలు ఒప్పందం కింద టారిఫ్ క్లెయిమ్ కోసం ధుర్సర్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.92కోట్ల 68 లక్షలను పూర్తిగా చెల్లించినట్లు
తెలిపింది. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించడానికి సంబంధించి మే 30, 2025 నాటి NCLT ముంబై ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని, దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ముందు అప్పీల్ చేస్తామని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకటించింది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.