
హైదరాబాద్: రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 13న ఆయన టీన్యాబ్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.