తమిళ స్టార్ హీరో విశాల్ నుంచి వస్తోన్న లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో.. ఎస్ జే సూర్య, సెల్వ రాఘవన్, సునీల్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పెళ్లిచూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా విశాల్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో పాటు మూవీ టీజర్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 27 బుధవారం సాయంత్రం 6:30 నిమిషాలకి మూవీ టీజర్ రిలీజ్ కానుంది. ఈ టీజర్ ని తమిళ స్టార్ హీరో తళపతి విజయ్ విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా మూవీ టీమ్ విజయ్ ని తన ఇంట్లో కలిశారు. దీనికి సంబందించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలోషేర్ చేసిన తమిళ డిస్టిబ్యూటర్ కార్తీక్ రవివర్మ.."మార్క్ ఆంటోనీ టీజర్ ని హీరో విజయ్ చూసారు. ఆయనకు చాలా బాగా నచ్చింది. అలాగే మీకు కూడా నచ్చుతుంది అని ఆశిస్తున్నారు". ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాని.. మినీ స్టూడియో బ్యానర్పై వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు.