
ముంబై: మహారాష్ట్రలోని థానె సిటీలో హెల్త్సిబ్బంది ఓ మహిళ(28)కు ఒకే రోజు నిమిషాల తేడాతో మూడు డోసుల వ్యాక్సిన్వేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. థానె సిటీకి చెందిన ఓ మహిళ ఈ నెల 25న వ్యాక్సిన్వేయించుకోవడానికి దగ్గరలోని హెల్త్సెంటర్కు వెళ్లింది. వ్యాక్సిన్ వేసిన హెల్త్ సిబ్బంది.. వేయడం పూర్తయింది, ఇక ఇంటికి వెళ్లాలని చెప్పలేదు. వ్యాక్సినేషన్పై అవగాహన లేకపోవడంతో ఆమె అక్కడే నిలబడింది. దీంతో హెల్త్ సిబ్బంది నిమిషాల తేడాతో మూడు డోసుల వ్యాక్సిన్ వేశారు. తనకు మూడు సార్లు వ్యాక్సిన్ వేశారని ఆమె భర్తతో చెప్పింది. విషయం విని భయపడిన ఆమె భర్త లోకల్ కార్పొరేటర్ కవిత సురేశ్ పాటిల్ను కలిశాడు. విషయం వెలుగులోకి రావడంతో థానె మున్సిపల్ కార్పొరేషన్ విచారణకు ఆదేశించింది. మహిళ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన హెల్త్ ఆఫీసర్ ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యాక్సిన్ వేసిన హెల్త్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్పొరేటర్మనోహర్ డుంబ్రే సహా పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.