
రొటీన్ ఫార్ములాల జోలికి పోకుండా కాస్త డిఫరెంట్గా ఉండే కాన్సెప్ట్స్ ఎంచుకుంటాడు అజయ్ దేవగన్. ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాలతో వస్తుంటాడు. అవార్డులూ రివార్డులూ అందుకుంటాడు. రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వీటిలో కొన్ని సెట్స్ మీద ఉన్నాయి. కొన్ని రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ముందుగా ‘థ్యాంక్ గాడ్’ రాబోతోంది.
అక్టోబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత ‘దృశ్యం 2’తో పలకరించబోతున్నాడు అజయ్. నవంబర్ 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఇక ఇప్పుడు ‘మైదాన్’కి కూడా డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 17న ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయబోతున్నట్టు నిన్న అనౌన్స్ చేశారు. పదమూడేళ్ల పాటు ఇండియన్ నేషనల్ ఫుట్బాల్ టీమ్కి కోచ్గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తీశాడు అమిత్ రవీంద్రనాథ్ శర్మ. సయ్యద్ పాత్రలో అజయ్ నటించాడు. ప్రియమణి హీరోయిన్.