- వివాదం కోర్టులో ఉంది.. పరిష్కారమైన వెంటనే అందరికీ చెబుతా: నటుడు సుమన్
హైదరాబాద్: ఇండియన్ ఆర్మీకి హీరో సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానిపై ఆయన స్పందించారు. సుమన్ మాట్లాడుతూ "సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. వాటిని ఎవరూ నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది.వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే... వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను.దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతా" అన్నారు నటుడు సుమన్.
ఇవి కూడా చదవండి
ఊ అంటావా కరోనా ! ఉ ఊ అంటావా !!
యూపీలో రసవత్తర పోరు.. అసెంబ్లీ బరిలో అఖిలేష్
ఫిబ్రవరి 8న తిరుమలలో ఏకాంతంగా రథసప్తమి
AP:రిటైర్మెంట్ 62 ఏళ్లు.. గవర్నర్ ఆమోదం