3 రాజధానులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

3 రాజధానులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
  • సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు తీర్పు శాసనవ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.  హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. 
సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు సూచించడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని ఏపీ సర్కార్ పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేశామని పిటిషన్‍లో పేర్కొన్న ప్రభుత్వం.. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.