న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఈ మేరకు మేనేజ్మెంట్ టీమ్ ను ఆ పార్టీ ఏర్పాటు చేసింది. ఆ టీమ్ కు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కన్వీనర్ గా, వినోద్ తాన్వే , సీటీ రవిలను కో కన్వీనర్లుగా బీజేపీ నియమించింది. ఇంకా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలను టీమ్ లో సభ్యులుగా నియామకం అయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విన్ వైష్ణవ్, సర్బానందా సోనోవాల్, అర్జున్ రాంపాల్ మేఘ్వాల్, భారతి పవార్, అలాగే పార్టీలో పలు హోదాల్లో ఉన్న తరుణ్ చుగ్, డీకే అరుణ, రితురాజు సిన్హా, వనాటి శ్రీనివాసన్, సంబిత్ పాత్రా, రాజ్ దీప్ రాయ్ ను టీమ్ సభ్యులుగా బీజేపీ నియమించింది. వీరంతా వివిధ రాష్ట్రాల బీజేపీ పార్టీ అధ్యక్షులు, సీఎంలు, ఇతర నాయకులతో నిత్యం టచ్ లో ఉంటూ రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయనున్నట్లు బీజేపీ తెలిపింది.
BJP includes Union Ministers Gajendra Singh Shekhawat, G Kishan Reddy, Ashwini Vaishnaw, Sarbananda Sonowal, Arjun Ram Meghwal, & Bharati Pawar, in the management team for the upcoming Presidential elections. pic.twitter.com/6b7hwRkx1u
— ANI (@ANI) June 17, 2022