ఇంట్లోకి దూసుకెళ్ళిన బస్సు..

ఇంట్లోకి దూసుకెళ్ళిన బస్సు..

ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో నాయకన్ గూడెం దగ్గర ఓ ప్రైవేట్ బస్సు రోడ్డుపక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ  ఘటనలో రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఓ ఇంట్లోని ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఓడిశా నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న 20మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

వేదాల ఆధారంగా కృష్ణ బియ్యం పండిస్తున్నకరీంనగర్ యువ రైతు

పెళ్లైన కొత్త జంటను ఆశీర్వదించిన కోతి