రాష్ట్రంలో మరో రెండు నేషనల్ హైవేలు

రాష్ట్రంలో మరో రెండు నేషనల్ హైవేలు

రాష్ట్రంలోని రెండు రహదారులను నేషనల్ హైవేలుగా కేంద్రం ప్రకటించడం పట్ల బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర రహదారులను ఎన్ హెచ్ లు ప్రకటించినందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ రెండు లాంగ్ రూట్స్ జాతీయ రహదారులుగా మారడం వల్ల రాష్ట్రంలో అత్యధిక ప్రాంతానికి కనెక్షన్ ఏర్పడుతుందన్నారు.

NH-167 పై మహబూబ్ నగర్ నుంచి కొడంగల్, తాండూరు, కర్ణాటక లోని చించొలీ ద్వారా  కర్ణాటకలోని బాపూర్ జంక్షన్ తో అనుసంధానం చేస్తున్న ఈ రోడ్డుకు జాతీయ రహదారి నంబర్ 167-N గా కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే  NH-30 పై కొత్తగూడెం  నుంచి ఇల్లందు, మహబూబాబాద్, నెల్లికుదురు, తొర్రురు, వలిగొండ ద్వారా వెళ్తూ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు గౌరెల్లి దగ్గర కనెక్ట్ అయ్యే ఈ రహదారిని NH-930 P గా ప్రకటించింది.