సంగారెడ్డి జిల్లాలో..చర్చికి స్లాబ్ వేస్తుండగా కూలిన సెంట్రింగ్

సంగారెడ్డి జిల్లాలో..చర్చికి స్లాబ్ వేస్తుండగా కూలిన సెంట్రింగ్
  •    మయన్మార్ కార్మికుడు మృతి  
  •    మరొకరికి సీరియస్..ఏడుగురికి గాయాలు   

మునిపల్లి(కోహీర్), వెలుగు :  సంగారెడ్డి జిల్లా కోహీర్​మండల కేంద్రంలోని ఓ చర్చి నిర్మాణ పనులు జరుగుతుండగానే స్లాబ్​ సెంట్రింగ్​ కూలి ఒకరు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. మయన్మార్ కు చెందిన ఖాసిం అలీ (20), నేపాల్ కు చెందిన రాజు, కోల్​కతాకు చెందిన కార్మికులు కొంతకాలంగా కోహీర్ లో ఉంటూ లాలాకుంటలో మెథడిస్ట్​చర్చినిర్మాణ పనులు చేస్తున్నారు. ఆదివారం స్లాబ్​పనులు చేస్తుండగా కింది భాగంలో చెక్కలు కూలడంతో అందరూ కిందపడ్డారు. దీంతో ఖాసిం అలీ, రాజు తీవ్రంగా గాయపడగా..

కోల్​కతాకు చెందిన మోహన్​సింగ్, అహ్మద్, క్రిష్ణానంద్, అబ్దుల్​రహీం, తాజుల్​షేక్, దలీం షా, షేక్ ఆదిల్​అహ్మద్​లకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఖాసీం అలీ, రాజులను సంగారెడ్డి గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఖాసిం అలీ చనిపోయాడు. రాజు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వారు కోహీర్ గవర్నమెంట్​హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలాన్ని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, జహీరాబాద్ డీఎస్పీ రఘు, సీఐ రాజు పరిశీలించారు.