సర్ ఎడ్వర్డ్ ల్యూటెన్స్ ఢిల్లీలోని 400 ఫ్లాట్లను కూలగొట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పడగొట్టిన బిల్డింగుల వ్యర్థాలతోనే పార్లమెంటు సభ్యులకు కొత్త భవనాలు కట్టించాలని భావిస్తోంది. రాష్ట్రపతి భవన్కు ఇరువైపులా ఉన్న నార్త్, సౌత్ అవెన్యూల్లో ఈ ఫ్లాట్లు ఉన్నాయి. వీటిని దాదాపు 60 ఏళ్ల క్రితం కట్టించారని సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్(సీపీడబ్ల్యూడీ) పెద్దాఫీసర్లు చెప్పారు. ఇక్కడి ఫ్లాట్ల కూల్చివేత వల్ల ఏర్పడే చెత్తతో కొత్త ఫ్లాట్లను కడతామని వెల్లడించారు. ఇటీవలే దాదాపు 80 కోట్ల రూపాయలతో 36 డూప్లెక్స్ ఫ్లాట్లను కట్టింది. వీటిని కొత్తగా ఎన్నికైన ఎంపీలకు కేటాయించనున్నారు. కొత్త ఇళ్లు కట్టడానికి ఇబ్బంది లేకుండా, పాత ఫ్లాట్లను ఒక క్రమపద్ధతిలో కూల్చుతామని సీపీడబ్ల్యూడీ ఆఫీసర్లు వివరించారు. కొత్త బిల్డింగ్స్ ను తక్కువ ఎత్తుతో కడతామని చెప్పారు. ప్రతి ఇంటికీ పార్కింగ్ తో ఇతర సదుపాయాలు ఉంటాయని, సోలార్ పవర్ తోనే ఇల్లు నడుస్తుందన్నారు. కొత్త లోక్ సభలో 300 మంది ఎంపీలు తొలిసారిగా ఎన్నికయ్యారు. వీళ్లలో క్రికెటర్ గౌతమ్ గంభీర్, కేంద్రమంత్రులు రవి శంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ తదితరులు ఉన్నారు. వీళ్ల కోసం ప్రభుత్వం తాత్కాలిక ఏర్పాట్లు చేసింది. గతంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు నివాసాలు ఇచ్చే వరకూ, ఫైవ్ స్టార్ హోటళ్లలో విడిది ఏర్పాటు చేసేవారు.
ఎంపీలకు ‘చెత్త’తో భవనాలు
- దేశం
- June 17, 2019
లేటెస్ట్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్