అరటి తొక్కపై కాలేసి కండక్టర్ మృతి

అరటి తొక్కపై కాలేసి కండక్టర్ మృతి
  • జారిపడి కండక్టర్ మృతి

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: అరటి తొక్క మీద అడుగు వేయడంతో జారిపడి కండక్టర్ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్​మండలం వేంనూర్ గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోట ఉమ(50) మహబూబాబాద్ ఆర్డీసీ డిపోలో కండక్టర్ గా చేస్తోంది. సోమవారం రాత్రి డ్యూటీ నుంచి తిరిగి ఇంటికి వచ్చింది. మంగళవారం ఉదయం లేచి బయటకు వస్తుండగా ప్రమాదవశాత్తు అరటి తొక్కపై  కాలు వేసి జారి పడింది. ఆమె తలకు తీవ్ర గాయం కావడంతో స్పాట్​లోనే కన్నుమూసింది.