న్యూఢిల్లీ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో తమకు తగిన వాటా ఇవ్వాలని కాంగ్రెస్ ఓబీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శుక్రవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని కలవాలని నిర్ణయించారు. గురువారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కాంగ్రెస్ ఓబీసీ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
సమావేశంలో వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మహేశ్ కుమార్ గౌడ్, మధు యాష్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్, కత్తి వెంకటస్వామి, కొనగాల మహేశ్, జగదీశ్వరరావు, చెరుకు సుధాకర్, మెట్టు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ సీట్ల కేటాయింపులో బీసీలకు దక్కాల్సిన స్థానాలపై పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. ఖర్గే, రాహుల్గాంధీని కలిసి తమ డిమాండ్లను వారి ముందు పెట్టాలని నేతలు నిర్ణయించారు.