3 నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్​ ఎగ్జామ్స్​

3 నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్​ ఎగ్జామ్స్​

కేయూ క్యాంపస్​, వెలుగు: గురువారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు డిగ్రీ సెమిస్టర్​ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు కేయూ ఎగ్జామ్స్​ కంట్రోలర్​ ప్రొఫెసర్​ పి.మల్లారెడ్డి తెలిపారు. బీఏ, బీబీఏ, బీసీఏ, బీకామ్​, బీఎస్సీ, ఒకేషనల్​కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్​ ఎగ్జామ్స్ జరుగుతాయన్నారు. ఫస్ట్,​ థర్డ్​ సెమిస్టర్​ ఎగ్జామ్స్​ ఉదయం 9 గంటల నుంచి  మధ్యాహ్నం12 గంటల వరకు, ఐదో సెమిస్టర్​ఎగ్జామ్స్​మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.