
రణ్ బీర్ కపూర్, అలియాభట్ జంటగా అయాన్ ముఖర్జీ రూపొందించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా గత యేడాది సెప్టెంబర్లో విడుదలైంది. మూడు భాగాలుగా రాబోతోందని ముందే చెప్పిన దర్శకుడు, మిగతా రెండు భాగాలు ఎప్పుడొస్తాయనే విషయంపై మంగళవారం క్లారిటీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించి ఓ లెటర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇందులో ఒకేసారి రెండు, మూడు భాగాల షూటింగ్స్ చేస్తామని, అలాగే ఎక్కువ గ్యాప్ లేకుండా వెంటవెంటనే ఆ రెండింటినీ విడుదల చేస్తామని చెప్పాడు. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా స్క్రిప్ట్ రెడీ చేసేందుకు మరికొంత సమయం పడుతుందని, అందుకే ‘బ్రహ్మాస్త్ర’ రెండో భాగాన్ని 2026లో, మూడో భాగాన్ని 2027లో విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. అదే సమయంలో మరో స్పెషల్ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం దక్కిందని, అది తనకు చాలెంజ్తో పాటు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అయాన్ అన్నాడు.
ఆ సినిమా పేరేమిటో చెప్పనప్పటికీ.. హృతిక్ రోషన్ హీరోగా రూపొందబోయే ‘వార్ 2’ని అయాన్ డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ‘బ్రహ్మాస్త్ర’కు మరో మూడేళ్ల టైమ్ తీసుకుని ఈలోపు హృతిక్ సినిమాని కంప్లీట్ చేయబోతున్నాడు అయాన్.