ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

10 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

రాజమండ్రి: భారీ వర్షాలకు గోదావరి నది వరద పోటెత్తుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వరద వస్తుండడంతో డ్యామ్ కు ఉన్న 175 గేట్లన్నీ ఎత్తేశారు. కొద్దిసేపటి క్రితం ఇన్ ఫ్లో 10 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వస్తున్న వరదను వస్తున్నట్లే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 

      గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తుండడంతో అధికార యంత్రాంగం అలర్టయింది. విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ఎప్పటికప్పడు వరద ప్రవాహం అంచనాలు తెలుసుకుంటూ.. గోదావరి ముంపునకు గురయ్యే ప్రాంతాల వారిని అలర్ట్ చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 9.40 అడుగులు మెయిన్ టెయిన చేస్తూ.. ఎగువ నుండి వస్తున్న 10 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలకు చేరుకునేందుకు ఎన్డీఆర్ ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయి.