పోలీసులపైకి కారెక్కించిన గంజాయి ముఠా..మహిళా కానిస్టేబుల్కు తీవ్రగాయాలు

పోలీసులపైకి కారెక్కించిన గంజాయి ముఠా..మహిళా కానిస్టేబుల్కు తీవ్రగాయాలు
  •     నిజామాబాద్ సిటీ శివారులో ఘటన

నిజామాబాద్​,  వెలుగు : ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. గంజాయి స్మగ్లింగ్​ ముఠా కారుతో ఢీ కొట్టడడంతో మహిళా కానిస్టేబుల్​తీవ్రంగా గాయపడింది. ప్రమాదం నుంచి సీఐ స్వప్న, 8 మంది కానిస్టేబుళ్లు తప్పించుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. 

వివరాల్లోకి వెళ్తే.. ​స్విఫ్ట్​ డిజైర్​ కారులో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రాత్రి నిజామాబాద్​ సిటీ శివారు మాధవ్​నగర్ లో ఎక్సైజ్ సీఐ స్వప్న, కానిస్టేబుళ్లతో కలిసి తనిఖీలు చేపట్టారు. కారు రోడ్డుపై వస్తుండగా ఆపేందుకు సీఐ, కానిస్టేబుళ్లు ముందుకెళ్లారు. 

మహిళా కానిస్టేబుల్​గాజుల సౌమ్య (24), కారును ఆపడానికి యత్నించగా, ఆమెపై ఎక్కించి వెళ్లి,  చెట్టును ఢీకొని ఆగిపోయారు. అప్పటికే స్మగ్లింగ్​ ముఠా సభ్యులు మహ్మద్​ సోఫిఉద్దీన్​, సయ్యద్​సోయల్​గంజాయిని సప్లై చేసేశారు.  

నిందితుల నుంచి 2 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.   మోస్రాకు చెందిన సౌమ్య 2024లో ఎక్సైజ్ కానిస్టేబుల్​గా ఎంపికయ్యారు.  ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలైన పక్కటెముకలు విరిగాయి.  కండీషన్ సీరియస్​గా ఉండడంతో హైదరాబాద్​తరలించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆస్పత్రికి సౌమ్యను పరామర్శించి డాక్టర్లతో మాట్లాడారు. ప్రభుత్వ ఖర్చుతో ఆమెకు ట్రీట్ మెంట్ చేయిస్తామని కలెక్టర్​ తెలిపారు.