
ఏపీలో పోలీసుల బీమాను పెంచింది ప్రభుత్వం. గతంలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్ చెల్లిస్తుండగా ఈసారి దాన్ని రూ.20 లక్షలకు పెంచారు. క్యాంప్ ఆఫీసులో సీఎం సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు.ఇకపై ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్వరకూ రూ.35 లక్షలను చెల్లించనున్నారు. డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 45 లక్షలను గ్రూప్ ఇన్సూరెన్స్ కింద చెల్లించనున్నారు.
ప్రమాదవశాత్తూ పోలీసులకు ఏదైనా జరిగితే చెల్లించే బీమాను కూడా గణనీయంగా పెంచారు. పోలీసు సిబ్బంది అసహజ మరణం పొందితే రూ. 30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతే రూ. 40 లక్షల రూపాయలను చెల్లించనున్నారు. ఇందులో 64719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుంది. పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఈ పాలసీలు అమలుకానున్నాయి. బీమా పెంపు నిర్ణయంతో సీఎం జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్.