- అన్ని యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు
హైదరాబాద్: డిగ్రీ, పీజీ పరీక్షలపై ఉన్నత విద్యా మండలి ఇవాళ కీలక ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ, పీజీ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించాలని అన్ని వర్సిటీల కు అదేశాలు జారీ చేసింది. డిగ్రీ మొదటి సెమిస్టర్, పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని యూనివర్సిటీలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది.
ఫిబ్రవరి 9వ తేదీ నుంచి డిగ్రీకి..ఫిబ్రవరి 27 నుంచి పీజీలో మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. యూనివర్సిటీలకు వేర్వేరుగా అకడమిక్ క్యాలెండర్లు అమలులో ఉండగా.. ఈ ఏడాది నుంచి అన్ని యూనివర్సిటీలకు ఒకే విద్యా క్యాలెండర్ ను అమలు చేస్తూ.. ఉన్నత విద్యా మండలి కామన్ షెడ్యూల్ ను ప్రకటించింది.