_sCXqkuVB2c.jpg)
గండిపేట, వెలుగు: ఏటీఎం మెషీన్లో పెట్టాల్సిన క్యాష్ బాక్సులతో వెహికల్ డ్రైవర్ పరారైన ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో జరిగింది. రైటర్స్ సేఫ్ గార్డ్ సంస్థ కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్లలో క్యాష్ను డిపాజిట్ చేసేందుకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తోంది. బోరబండకు చెందిన ఫరూఖ్ రెండ్రోజుల కిందట ఫేక్ ఆధార్ కార్డును ప్రూఫ్గా చూపించి రైటర్స్ సేఫ్ గార్డు సంస్థలో డ్రైవ
ర్గా చేరాడు. గురువారం రాజేంద్రనగర్లోని కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్లో క్యాష్ పెట్టేందుకు బ్యాంక్ సిబ్బంది అశోక్, భాస్కర్, సెక్యూరిటీ సిబ్బంది కేవీ రామ్, చంద్రయ్య రూ.72 లక్షలతో ఫరూఖ్తో కలిసి వెహికల్లో బయలుదేరారు. బ్యాంక్, సెక్యూరిటీ సిబ్బంది క్యాష్ బాక్సులతో ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్లారు. షట్టర్ క్లోజ్ చేసి మెషీన్లో క్యాష్ డిపాజిట్ చేసి బయటికి వచ్చి చూసేసరికి వెహికల్తో పాటు ఫరూఖ్ కనిపించలేదు.
వెహికల్కు ఉన్న జీఎపీఎస్ ను తొలగించిన ఫరూఖ్ బుద్వేల్ మీదుగా కిస్మత్ పురా బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. రూ.3 లక్షలున్న క్యాష్ బాక్సుతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి చెందిన రెండు గన్లు తీసుకున్నాడు. వెహికల్ను రోడ్డు పక్కన వదిలేసి పారిపోయాడు. జీపీఎస్ చివరి సిగ్నల్ను ట్రేస్ చేసిన సేఫ్ గార్డు ఏజెన్సీ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ వోటీ పోలీసులు కిస్మత్ పురా రూట్లో గాలించారు. బ్రిడ్జి దగ్గరి వెహికల్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. క్యాష్ బాక్సుల్లో ఒకటి మాత్రమే లేదని.. మిగతావి అలాగే ఉన్నాయని బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.