గణాంకాలు సరి చేసుకోవాలి : సెంట్రల్ ప్రభారీ స్వప్న దేవి రెడ్డి

గణాంకాలు సరి చేసుకోవాలి : సెంట్రల్ ప్రభారీ స్వప్న దేవి రెడ్డి
  • సెంట్రల్​ ప్రభారీ స్వప్న దేవి రెడ్డి

మహబూబ్​నగర్​, వెలుగు: నర్వ ఆస్పరేషన్  బ్లాక్  సూచికల ప్రకారం కొన్ని గణాంకాలు సరిగా నమోదు కాలేదని సెంట్రల్​ ప్రభారీ స్వప్న దేవి రెడ్డి పేర్కొన్నారు. డేటా, సాఫ్ట్ వేర్ లో ఏమైనా సాంకేతిక లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. 

నారాయణపేట జిల్లాలోని  నర్వ యాస్పరేషన్  బ్లాక్  ప్రాజెక్ట్  ప్రగతిపై సోమవారం సాయంత్రం కలెక్టరేట్​లోని వీసీ హాలులో ఇన్​చార్జి​కలెక్టర్  సంచిత్ గాంగ్వర్ తో కలిసి సెంట్రల్  ప్రభారీ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా నర్వ ఆస్పరేషన్  బ్లాక్​లో ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక, మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధిరంగాల్లో కీలకమైన ఆస్పిరేషనల్  బ్లాక్  ప్రోగ్రామ్(ఏబీపీ) సూచికల ప్రకారం ఇప్పటి వరకు చేసిన వివిధ అభివృద్ధి పనులపై ఆరా తీశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాయిల్  హెల్త్  కార్డులో ఏ సూచికలు ఉంటాయని డీఏవోను అడిగి తెలుసుకున్నారు. బ్లాక్​లో నిర్దేశించిన మిగిలిన అన్ని సూచికల్లో వంద శాతం లక్ష్యంగా ముందుకెళ్లాలని ఆదేశించారు. అడిషనల్​ కలెక్టర్  శ్రీను, ట్రైనీ కలెక్టర్  ప్రణయ్ కుమార్, డీఆర్డీవో మొగులప్ప, డీఏవో జాన్  సుధాకర్, డీపీవో సుధాకర్ రెడ్డి, డీఎంహెచ్​వో జయ చంద్రమోహన్, డీఈవో గోవిందరాజులు, నోడల్  ఆఫీసర్​ హీర్యా నాయక్, నర్వ తహసీల్దార్  మల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, యాస్పరేషన్  బ్లాక్  సమన్వయకర్త బాలాజీ పాల్గొన్నారు.