బ్యాడ్మింట‌న్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భార‌త్‌కు సిల్వర్

బ్యాడ్మింట‌న్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భార‌త్‌కు సిల్వర్

బర్మింగ్ హామ్: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతోంది. మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన బాట్మింటన్ మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన భారత జట్టు రజతం గెలుచుకుంది. దీంతో తాజాగా భారత్‌ ఖాతాలో 13వ పతకం వచ్చి చేరింది. పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవ్వడంతో భారత్‌ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇండియ‌న్ జ‌ట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డిలు పోరాడి ఓడారు. ఆ ఇద్దరూ టెంగ్ ఫాంగ్‌, వూయి ఇక్ చేతిలో 21-18, 21-15 స్కోర్‌తో ఓడిపోయారు. ఇక రెండో మ్యాచ్‌లో పీవీ సింధు 22-20, 21-17 తేడాతో జిన్ వెయి గోపై విజ‌యం సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 19-21, 21-6, 16-21 స్కోర్‌తో నెగ్ తెజ్ యాంగ్ చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఆ మ్యాచ్ గంటా ఆరు నిమిషాలు సాగింది. నాలుగ‌వ మ్యాచ్‌లో ట్రెస్సా జాలీ, గాయ‌త్రి గోపిచంద్ ఓడిపోయారు. కాగా... విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు అభినందనలు తెలిపారు.