ది కేరళ ఫైల్స్ సినిమా అంతా నిజమే.. ఉగ్రవాదానికి కాంగ్రెస్ లొంగిపోయింది : మోడీ

ది కేరళ ఫైల్స్ సినిమా అంతా నిజమే.. ఉగ్రవాదానికి కాంగ్రెస్ లొంగిపోయింది : మోడీ

ది కేరళ ఫైల్స్ మూవీపై ప్రధాని  మోడీ తొలిసారిగా  స్పందించారు. కేరలో జరుగుతున్న ఉగ్రవాద కుట్ర  సత్యాన్ని  ఈ సినిమాలో బయటపెట్టారని మోడీ తెలిపారు. మే 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బళ్లారిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉగ్రవాదులతో కలిసి కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతుందని ఆరోపించారు. వారకి అండగా ఉంటూ తెరవెనుక రాజకీయలు చేస్తోందని  మండిపడ్దారు.  

తీవ్రవాదం, ఉగ్రవాద ధోరణులపై తీసిన ది కేరళ ఫైల్స్ సినిమాను  కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తోందని మోడీ అన్నారు.  ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని కాపాడతుందోని తీవ్రమైన ఆరోపణలు గుప్పి్ంచారు.  మరి అలాంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను కాపాడగలదా అని ప్రశ్ని్ంచారు.   కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు భద్రతా వ్యవస్థ, శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమైనవని చెప్పారు.  ఉగ్రవాదంపై బీజేపీ ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తోందని  మోడీ  స్పష్టం చేశారు.  

కాంగ్రెస్ గెలుపు కోసం తప్పుడు కథనాలు, సర్వేలు చేస్తుందని,  రాష్ట్రంలోని ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదని మోడీ  విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అంతా బుజ్జగింపుల గురించి, నిషేధాల గురించి ఉందని ఎద్దేవా చేశారు.  యడ్యూరప్ప, బొమ్మై నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి మూడున్నరేళ్లు మాత్రమే ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని మోడీ తెలిపారు. మరోసారి బీజేపీకి కన్నడ ప్రజలు అధికారం ఇవ్వాలని, కర్నాటకను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తామని  ఈ సందర్భంగా మోడీ  హామీ ఇచ్చారు.