ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు ఉద్యమం ఆగదు :గుండారం మోహన్​

ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు ఉద్యమం ఆగదు :గుండారం మోహన్​

బోధన్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు ఉద్యమం ఆగదని టీఎమ్మార్పీఎస్ ​జిల్లా అధ్యక్షుడు గుండారం మోహన్​ పేర్కొన్నారు.  బుధవారం బోధన్​లోని పార్టీ​ ఆఫీస్​లో ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. మోహన్ ​మాట్లడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 28 ఏండ్లుగా పోరాటం సాగుతుందని, రాజకీయ పార్టీలు మాదిగలను ఓటు బ్యాంక్​గా వాడుకుంటున్నారే తప్ప తమ ఆకాంక్షను నెరవేర్చడం లేదన్నారు.

వచ్చే పార్లమెంట్​సమావేశంలో ఎస్సీవర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్​ చేశారు. ఈ నెల 29న టీఎమ్మార్పీఎస్ ​రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న ఆధ్వర్యంలో హైదరాబాద్​లో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సభను విజయవంతం చేయాలని కోరారు. లీడర్లు బద్ధం లింగన్న, ఏ.మారయ్య, ఎమ్.సుధాకర్, పోసాని, వి.నాగురావ్, పోశెట్టి పాల్గొన్నారు.