
అనేక చిత్రాలకు కో ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా వర్క్ చేసిన కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం ‘టాప్ గేర్’. ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా శశికాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఇవ్వాళ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఆది చాలామంచి పెర్ఫార్మర్. డ్యాన్స్లు కూడా బాగా చేస్తాడు. కానీ అతని స్ర్కిప్ట్ సెలెక్షన్లోనే ఒక్కోసారి మిస్ ఫైర్ జరిగింది. వచ్చే ఏడాదికి ఈ సినిమాతో గ్రాండ్ వెల్కమ్ చెబుతాడు. శశికాంత్ చెప్పిన స్టోరీ కొత్తగా అనిపించింది. మంచి కంటెంట్ ప్రేక్షకులకు అందిస్తున్నామనే నమ్మకం ఉంది.
క్యాబ్ డ్రైవర్గా పనిచేసే ఆది..అనుకోకుండా చిక్కుల్లో పడతాడు. దానినుంచి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడనేది కథ. రియా సుమన్.. ఆదికి భార్యగా ఇన్నోసెంట్గా కనిపిస్తుంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స్క్రీన్ప్లే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. డ్రగ్స్ బ్యాక్డ్రాప్తో ఇంటరెస్టింగ్గా కథను తీసుకెళ్లాడు శశికాంత్. ఓటీటీలో కూడా ఇలాంటి కాన్సెప్ట్ను బాగా ఆదరిస్తారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా టాప్ టెక్నీషియన్స్తో వర్క్ చేశాం. హర్ష వర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు హైలైట్గా ఉంటుంది. ఇండస్ట్రీలో నాకున్న పరిచయాలతో బిజినెస్ పూర్తి చేశా. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200కి పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు.