న్యూఢిల్లీ : విప్రో లిమిటెడ్పై దివాలా ప్రక్రియను ప్రారంభించాలంటూ ఆపరేషనల్ క్రెడిటార్ వేసిన పిటిషన్ను నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. గతంలోనే విప్రో, పిటిషనర్ మధ్య చెల్లింపుపై వివాదం ఉందని అప్పీలేట్ ట్రిబ్యునల్లోని ఇద్దరు సభ్యుల చెన్నై బెంచ్ పేర్కొంది. ఈ కేసుకు దివాలా కోడ్ వర్తించదని స్పష్టం చేసింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీలాట్) ఎన్సీఎల్టీ ఉత్తర్వును సమర్థించింది. అంతకుముందు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) బెంగళూరు బెంచ్ జనవరి 16, 2020 న, ఆపరేషనల్ క్రెడిటార్ హోదాలో ట్రైకోలైట్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. దీంతో ఈ ఆర్డర్ను ఎన్సీలాట్లో సవాల్ చేసింది.
ఇన్వాయిస్ మొత్తంలో మూడు శాతం మొత్తం గురించే వివాదం నడుస్తోందని పేర్కొంది. కేసులో స్పష్టత ఉంటేనే కార్పొరేట్ బారోవర్పై దివాలా కోడ్ ప్రకారం చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని స్పష్టం చేసింది. ఇక్కడ అప్పు విషయంలో పార్టీల మధ్య తీవ్రమైన వివాదం లేదని అభిప్రాయపడింది. విప్రో చేపట్టిన ఒక ప్రభుత్వ ప్రాజెక్ట్ కోసం వస్తువుల సరఫరాకు సంబంధించి ట్రైకోలైట్తో వివాదం ఏర్పడింది.