
8వ నిజాం ముకురం ఝాకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించడాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టే వారు మానసిక వైకల్యం కలవారని విమర్శించారు. నిజాంల సంపదను కేసీఆర్ ప్రభుత్వం అమ్ముకుంటోందని రేవంత్ ఆరోపించారు. అందరు గర్వించే ఓ గొప్ప పనికి ప్రభుత్వం ముకురం ఝా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎలాంటి కార్యక్రమం చేపట్టాలనే అంశంపై ప్రభుత్వం అసెంబ్లీలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
నిజాం నవాబుల పాలనలో కొన్ని తప్పులు జరిగినా.. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని రేవంత్ తెలిపారు. ఆ తప్పులను కాంగ్రెస్ సమర్థించదని చెప్పారు.ఉస్మానియా, నిలోఫర్, కోరంఠి ఆస్పత్రులు, ఉస్మానియా కాలేజీ నిర్మించిన ఘనత నిజాం నవాబులదేనని చెప్పారు. హెల్త్కు, ఎడ్యుకేషన్కు నిజాంలు పెద్దపీట వేశారని రేవంత్ గుర్తు చేశారు.