- హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఘటన
వనస్థలిపురంలోని వ్యాక్సిన్ సెంటర్లో గందరగోళం నెలకొంది. ఓ యవతికి వైద్యసిబ్బంది డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆదివారం ఓ యువతి వ్యాక్సిన్ తీసుకోవడానికి సెంటర్కి వెళ్లింది. అక్కడ వ్యాక్సిన్ ఇస్తున్న నర్స్.. ఫోన్ మాట్లాడుతూ యువతికి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చింది. డబుల్ డోస్ ఇవ్వడంతో యువతి అక్కడే పడిపోయింది. వెంటనే స్పందించిన అధికారులు.. యువతిని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కు తరలించారు.