తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన తేదీలు ఇవే..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన తేదీలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి. అక్టోబర్‌ 3వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్న ఈసీ బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది.

ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా వంటి నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశం కానుంది. డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపై చర్చించనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల నోడల్‌ అధికారులతో సమావేశమై.. భద్రతా పరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై సమీక్షిస్తారు. 

ALSO READ: కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ బోగస్ : మంత్రి జగదీష్ రెడ్డి

రెండో రోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానున్న ఈసీ బృందం... జిల్లాల వారీగా ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లను సమీక్షించనుంది. మూడో రోజు మాత్రం తెలంగాణ రాష్ట్ర సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తారు.